గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 28 వేల ఎకరాల పచ్చని పొలాలను మింగేయబోతున్న వాడరేవు, నిజాంపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ (VAN PIC – వాన్ పిక్ ) ను వ్యతిరేకిస్తూ మానవ హక్కుల వేదిక ఒక ప్రచారయాత్రను చేపడుతున్నది.
నవంబర్ 15 నాడు నిజాంపట్నం మండలంలోని అదవల నుండి నర్రావారిపాలెం దాకా ఈ ప్రచార యాత్ర సాగుతుంది. వాన్ పిక్ ప్రాజెక్టు వల్ల కలిగే దుష్ఫలితాలేమిటో, దానికి జరుగుతున్న భూసేకరణ ఎంత అడ్డగోలుగా జరుగుతుందో వివరించే మానవ హక్కుల వేదిక వారి కరపత్రం ఇక్కడ చదవండి