నిస్సహాయుల గుండె చప్పుడు

వ్యక్తిగత పనిమీద గురువారం సూర్యాపేటకు వెళ్ళాను. అక్కడికి చేరుకునేసరికే రాత్రి పదకొండు దాటింది. అన్నం తిని నిద్రపోయిన గంట సేపటికి నా సెల్ ఫోన్ లో మిత్రుడు పిట్టల శ్రీశైలం ఇచ్చిన ఎసెమ్మెస్ నన్ను నిద్రలేపింది. మానవహక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్ హఠాన్మరణం చెందారని. ఒక్క క్షణం అర్థం కాలేదు. హక్కుల నేతలు మరణించారంటే ముందు అనుమానం పోలీసులపైకే మళ్లే రాష్ట్రం ఇది. కాసేపయ్యాక తెలిసింది ఆయన అనారోగ్యంతో మరణించారని.

పోలేపల్లి సెజ్ బాధిత ప్రజల కొరకు ప్రజా కోర్టు నిర్వహించినప్పుడు బాలగోపాల్ గారి పని విధానం అతి దగ్గరగా చూసే అవకాశం కలిగింది నాకు. ఈ దేశంలో పీడితుల పక్షాన సుధీర్ఘ కాలం నిలిచి పోరాడిన అతి కొద్ది మంది మేధావులలో బాలగోపాల్ ఒకరు.

balagopal1

balagopal2

పోలేపల్లి సెజ్ పబ్లిక్ హియరింగ్ లో బాలగోపాల్ పాల్గొన్నప్పటి చిత్రాలు

పౌర హక్కులంటే నక్సలైట్ల హక్కులేనా అని ప్రశ్నించే అనేకమంది బాలగోపాల్ తన జీవిత కాలంలో ఎన్ని వర్గాల ప్రజల హక్కుల కొరకు పోరాడాడో ఒక సారి తెలుసుకోవాలి. నిరాడంబరమైన ఆయన జీవన విధానం, అలుపెరగని ఆయన పోరాట స్ఫూర్తి నిజంగా అనితర సాధ్యం.

కొద్దికాలం క్రితమే మరో గొప్ప హక్కుల నేత గొర్రెపాటి నరేంద్రనాధ్ మృతిచెందారు. ఇప్పుడు బాలగోపాల్ కూడా మరణించడంతో రాష్ట్రంలో హక్కుల ఉద్యమానికి తీరని నష్టం కలిగింది.

కామ్రేడ్ బాలగోపాల్ అమర్ రహే!

రెండో అనువాదం విడుదలయ్యింది!

kutrajakeeyam

నా రెండో అనువాద పుస్తకం “కుట్రాజకీయం” గత నెల విడుదల అయ్యింది. గత రెండు మూడు వారాలుగా వ్యక్తిగత పనుల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల ఈ విషయం బ్లాగులో రాయడం ఆలస్యం అయ్యింది.

న్యూయార్క్ టైంస్ విలేకరి స్టీఫెన్ కింజర్ ఇంగ్లీషులో రాసిన “ఓవర్ త్రో” [Overthrow] అనే ఇంగ్లీషు పుస్తకానికి ఇది సంక్షిప్త స్వేచ్చానువాదం.

120 పేజీల ఈ పుస్తకం వెల 40 రూపాయలు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. వీలైతే చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.

ఒక గొప్ప రైతు అస్తమయం

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు గొర్రెపాటి నరేంద్రనాధ్ మరణించారని నిన్న సాయంత్రం మిత్రుడు రాకేష్ ద్వారా తెలిసింది. ఆచరణ సాధ్యం కాని పెద్ద పెద్ద మాటలు “మాట్లాడే” మేధావులున్న ఈ రోజుల్లో చెప్పే మాటలను చేతల్లో చూపించే మనకాలపు మేధావి నరేంద్రనాధ్.

ఆయన ఆత్మకథ “ఇట్లు ఒక రైతు”లో ఒక వైపు ఎంతో అనుభవజ్ఞుడైన సామాజిక ఉద్యమకారుడిగా వివిధ సమస్యలకు కారణాలు, పరిష్కారాలు చూపిస్తూనే మరో వైపు ఒక అమాయక పల్లెటూరి రైతులా సేంద్రియ వ్యవసాయం అమలులొ ఉండే సాధకబాధకాలు ఏకరువు పెడతారు. అసలు సేంద్రియ వ్యవసాయం మాట్లాడినంత సులభమూ, లాభదాయకమూ కాదని కుండబద్దలుకొట్టి చెబుతారు. ఇట్లు ఒక రైతు మన గ్రామీణ రైతాంగపు దుస్థితిని కళ్లకుకడుతుంది. మనం సాధిస్తున్న “అభివృద్ధి” ఎంత మేడిపండువంటిదో వివరిస్తూ, పరిస్థితి మారాలంటే మన ప్రభుత్వాలు ఏమి చేయాలో కూడా దిశానిర్దేశం చేస్తారు నరేన్ ఈ పుస్తకంలో.

చదవుట కొనసాగించు ‘ఒక గొప్ప రైతు అస్తమయం’

శంభుని శిరము నుండి సీసాలోకి…

ప్రజలందరికీ మినరల్ వాటర్ సరఫరా చేస్తామని మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆర్ధిక మాంద్యం కారణంగా భూమిని అమ్ముకోవడం గిట్టుబాటు కావట్లేదేమో నీటిని అమ్ముకునే ఉపాయం కనిపెట్టారు మన పాలకులు. నీటి వ్యాపారమైతే ఏ మాంద్యమూ దెబ్బతీయదని వారి నమ్మకం.

ఈ నిర్ణయంపై ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మొన్న ఒక మంచి సంపాదకీయం రాశాడు. మన ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా తమ బాధ్యతలను ప్రైవేటుకు ఎలా అప్పజెప్తున్నాయో, మధ్య తరగతి ప్రజలు ఎలా ఈ మార్పులను పట్టించుకోవడం మానేశారో చక్కగా వివరించాడు.

కింద ఆ సంపాదకీయం చదవండి. 

శంభుని శిరము నుండి సీసాలోకి…

- కె.శ్రీనివాస్‌

28ARTMAIN-copy

ఇరవయ్యో శతాబ్ది రెండో దశకంలో జంట జలాశయాల నిర్మాణం పూర్తి అయ్యాక, హైదరాబాద్‌ నగరంలో పంపుల ద్వారా ఇళ్లకు మంచినీరు ఇచ్చే పథకం రెడీ అయింది. దానికి సంబంధించిన అంచనాలను, ఖర్చు ను భరించడానికి విధించవలసిన చార్జీలను అధికారులు ఏడో నిజాం ముందు సమర్పించారు. ఆ లెక్కలన్నీ చూసిన ఉస్మాన్‌ అలీఖాన్‌ ఒకే ఒక ప్రశ్న వేశారు. “ఏమిటి, మనం మంచినీళ్ల కోసం జనం నుంచి డబ్బులు వసూలు చేయాలా? ఇంత పెద్ద రాజ్యానికి పాలకుడనై ఉండి నేను నీళ్లను అమ్ముకోవాలా?” చరిత్రలో అపఖ్యాతి పాలైన ఒక రాచరిక నియంత అతను. అయినప్పటికీ, పాలితులతో ఉండవలసిన సంబంధం గురించి అతనికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఎన్ని రకాల పన్నులు వేసి జనాన్ని వేధించినప్పటికీ, మంచినీటికోసం రుసుము వసూలు చేయడానికి అతని పాలక హృదయం సమ్మతించలేదు.

చదవుట కొనసాగించు ‘శంభుని శిరము నుండి సీసాలోకి…’

తరువాతి కాగితం »


ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,597 సందర్శకులు