'తెలంగాణ' వర్గానికి భండారం

తిరుపతమ్మకు అవార్డొచ్చింది

తెలంగాణా ప్రాంతంపై మన రాష్ట్ర పాలకుల నేరపూరిత నిర్ల్యక్షానికి నల్లగొండ జిల్లాను అనేక దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతం ఒక ఉదాహరణ. పక్కనే కృష్ణమ్మ నీరు శిశువుకు దక్కని స్థన్యంలా పారుతూ అటు డెల్టాకు సాగు నీరు, ఇటు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందిస్తుంటే నల్లగొండ జిల్లా ప్రజలు మాత్రం ఫ్లోరిన్ విషపు జలాలతో గొంతు తడుపుకుంటున్నారు. స్వతంత్రం వచ్చిన ఆరు దశాబ్దాల తరువాత కూడా ప్రజలకు తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లను ఇవ్వలేని మనం “అభివృద్ధి” సాధించామని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి.

పల్లెలు గొంతులో పచ్చి విషం నింపుకుంటుంటే వేలకోట్ల ప్రపంచ బ్యాంక్ డబ్బుతో రాజధాని నగరానికి కృష్ణ నీరు కొండలు గుట్టలూ దాటి ఖరీదు కట్టే షరాబులను వెదుక్కుంటూ  పైపులైన్లలో పరుగులు పెడుతోంది.  నగరంలో కోకకోలా ప్లాంట్లకూ ఈ నీరే రెండు పైసలకు లీటర్ ధరకు సరఫరా అయి మనకు “కిన్లే” అనే 12 రూపాయల మినరల్ వాటర్ సీసా రూపంలో లభ్యమవుతుంది.

వాటర్ బోర్డు వారి Dial A Tanker ప్రకటన చూశారా? 250 రూపాయలకే “స్వచ్చమైన, సురక్షితమైన” 5000 లీటర్ల నీరు. అంటే 5 పైసలకు లీటర్ నీరు. మరి నల్లగొండ నుండి మోసుకొచ్చి, శుద్ధి చేసి నగర ప్రజలకు పైపుల్లో, ట్యాంకర్లలో, ఇప్పుడయితే ఏకంగా సీసాల్లో (వాటర్ వర్క్స్ వారు మినరల్ వాటర్ కూడా అమ్ముతున్నారు) సరఫరా చేయగల వనరులు, సాంకేతిక విజ్ఞానం మన దగ్గర ఉంది. కానీ అదేం చిత్రమో నల్లగొండ జిల్లాలోని పల్లెలకు మాత్రం మంచి నీరు ఇవ్వలేదు మన ప్రభుత్వం. బహుశా వారికి “మార్కెట్” సైజు సరిపోలేదేమో

అయినా నేటి “మార్కెట్” లో మనుషులకు ఎక్కడుంది స్థానం… ఇక్కడంతా అమ్మకందారులు కొనుగోలుదారులే కదా.

నీరు పల్లమెరుగు అనేది పాత సామెత. ఇప్పుడైతే నీరు “మార్కెట్” నే ఎరుగును.

లక్షల మంది పౌరులు విషపూరితమైన నీరు తాగి జీవచ్చవాలుగా మారుతుంటే మన ప్రభుత్వాలేమో కుంభకర్ణ నిద్ర నటిస్తున్నాయి. మాకు తాగేందుకు గుక్కెడు నీళ్లిప్పించమని నల్లగొండ వాసులు అనేక ఏళ్లుగా చేస్తున్న విజ్ఞప్తులు, ఉద్యమాలు మన నేతల చెవికి సోకట్లేదు.

ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకోని ప్రభుత్వాల నిర్ల్యక్షాన్ని ఎండగట్టే ఉద్దేశంతో దుశ్చర్ల సత్యనారాయణ అనే సామాజిక ఉద్యమకారుని నేతృత్వంలో 1994 పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు 500 మంది నల్లగొండ ఫ్లోరిన్ బాధితులు నల్లగొండ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేశారు. ఈ చర్య ద్వారా సమస్య గురించి దేశవ్యాప్తంగా తెలిసింది కానీ పరిష్కారం మాత్రం లభించలేదు.

ఈ సమస్య తెరమీదికి వచ్చినప్పుడల్లా నాలుగు రోజులు మీడియా హడావిడి చేస్తుంది, ఆ తరువాత షరా మామూలే. ప్రతీ ఎన్నికల రుతువులో రాజకీయ నాయకులు రావడం, ఫ్లోరిన్ సమస్య నుండి విముక్తి కలిగిస్తామని వాగ్ధానలు చేయడం, ఎన్నికలు ముగియగానే ముఖం చాటేయడం…ఇదీ తంతు.

మొన్న శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ ఫ్లోరిన్ సమస్య తెర మీదికి వచ్చింది. అనేక ఏళ్లుగా ఫ్లోరిన్ బాధితుల పోరాటానికి Poster Child గా నిలిచిన తిరుపతమ్మ మరోసారి ప్రభుత్వ నిర్ల్యక్షాన్ని నిరసిస్తూ  ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసింది. అయితే ఏదో చిన్న కారణంతో అధికారులు ఆమె నామినేషన్ తిరస్కరించారు.

తిరుపతమ్మకు ఈ యేడాది యంగ్ ఉమన్‌ అచీవర్‌ అవార్డు లభించిందని తెలిసి చాలా సంతోషం కలిగింది. ఇవాళ్టి ఈనాడు వసుంధరలో తిరుపతమ్మ పై వచ్చిన కథనం కింద చదవండి:

చదవుట కొనసాగించు ‘తిరుపతమ్మకు అవార్డొచ్చింది’

మీరెవరు మేమెవరు వైయెస్?

“తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సూత్రప్రాయంగా ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఈ విషయంపై నిర్ణయాత్మక చర్యలు చేపట్టే సమయం ఆసన్నమైంది”

ఫిబ్రవరి రెండో వారంలో 12వ శాసన సభ చివరి సమావేశం చివరి క్షణాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయెస్ రాజశేఖరరెడ్డి గారన్న మాటలివి.

అయిదు దశాబ్దాలుగా ఎన్నో వంచనలు ఎదుర్కొన్న తెలంగాణా ప్రజలను ఆనాడు వైయెస్ మరోసారి  కౄరంగా పరిహసించాడు

మొన్న ఏప్రిల్ 7 నాడు కరీంనగర్ బహిరంగసభలో మాట్లాడుతూ సోనియాగాంధీ గారు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కాంగెస్ వ్యతిరేకం కాదనీ, అది తమకు అత్యంత ప్రాధాన్యతాంశమని చిలక పలుకులు వల్లె వేసింది.

గత అయిదేళ్లుగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై వై యెస్, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కలిసి ఆడిన నాటకాలు ఒకటా రెండా. పూటకో మాట మారుస్తూ ప్రజల న్యాయమైన ఆకాంక్షలతో ఆటలాడుకున్నాడు వైయెస్. 

తొలి విడత పోలింగు ఇంకా పూర్తిగా ముగియక ముందే వైయెస్ అటు రాయలసీమలోనూ, ఇటు కోస్తాలోను చేసిన వ్యాఖ్యలు బహుశా వైయెస్ ఒక మనిషిగా ఎంత పతనమయ్యాడో చూపించే సూచిక.

ఆయన అన్న మాటలు చూడండో సారి “మహాకూటమి అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో “మనం” విదేశీయులుగా బ్రతకాల్సి వస్తుంది”

మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగులుతోందని వార్తలు రాగానే వైయెస్ తన ముసుగు తీసి పక్కనపెట్టి నిస్సిగ్గుగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఆ విద్వేషాగ్నిలో చలికాచుకునే పనిమొదలు పెట్టాడు.

నాలుగు వందల ఏళ్ల  పైచిలుకు హైదరాబాద్ చరిత్రను ఒక్కసారి పరికిస్తే ఈ నగరం ఎన్ని ప్రాంతాల ప్రజలను ఆదరించి అక్కునజేర్చుకుందో అర్థం అవుతుంది. ఎంతోమంది విదేశీయులే ఈ నగరాన్ని తమ నివాస ప్రాంతంగా చేసుకున్న ఉదాహరణలు ఓవైపు ఉంటే వైయెస్ మాత్రం బరితెగించి అబద్దపు ప్రచారానికి తెగబడుతున్నాడు. గడచిన అయిదేళ్లుగా హైదరాబాద్ నగరాన్ని ఎన్నివిధాలో పీల్చిపిప్పి చేసి ఇప్పుడు ఇలాంటి కారుకూతలు కూయడం ద్వారా వైయెస్ చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడు.

తన ఎత్తుగడ విఫలమై అటు మీడియా, ఇటు ప్రతిపక్షాలు తన మీద దుమ్మెత్తిపోసే సరికి “ఏం కేసీఆర్ అంటే తప్పులేదు నేను అంటే తప్పేంటి?” అని సిగ్గులేకుండా ఎదురు ప్రశ్నిస్తున్నాడు.

నువ్వు రాయలసీమ ప్రాంతీయ నేతవు అయితే మేమెవరం పట్టించుకోం వైయెస్, కానీ దురదృష్టవశాత్తూ నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి.

తెలంగాణా ప్రాంత ప్రజలకు జరిగిన అన్యాయాన్ని గురించి వివరిస్తూ కేసీయార్ కొన్నిసార్లు అధిక ప్రసంగం చేసిన మాట నిజం. అయితే గడచిన ఎనిమిదేళ్లుగా తెలంగాణ వంటి భావోద్వేగ ఉద్యమాన్ని హింసకు తావులేకుండా కేసీయార్ నడిపిస్తున్న తీరు నిజంగా ప్రశంసనీయం. ముఖ్యంగా 1969 ఉద్యమం ఎంత త్వరగా హింసాత్మకం అయ్యిందో గుర్తున్న వాళ్లకు ఇప్పటి ఉద్యమం అత్యంత శాంతియుతంగా రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిందనే విషయం అర్థం అవుతుంది. కేసీయార్ స్వయంగా అనేక సార్లు “పొట్టగొట్టిన వాళ్లతోనే పేచీ గానీ పొట్ట చేతపట్టుకు వచ్చిన వారితో కాదు” అని స్పష్టంగా ప్రకటించి ఉన్నాడు.

ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారేమో నంద్యాలలో  “మనల్ని” బ్రతకనీయరు అంటున్నారు.

చంద్రబాబు దెబ్బకు కోమాలోకి వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ కు మళ్లీ ప్రాణం పోసి గెలిపించింది తెలంగాణ ప్రజలు. అయిదేళ్లు ఎన్ని నాటకాలు ఆడినా మా ముఖ్యమంత్రి నువ్వే అని అనుకుంది తెలంగాణా. కానీ నువ్వు మాత్రం నీ కొంచెపు బుద్ధిని బయటపెట్టుకున్నావు.

ఇదివరకోసారి హైదరాబాదును నెత్తుటేర్లలో ముంచి రాజకీయ లబ్ధిని పొందిన నీకు మనుషుల ప్రాణాలను సోపానాలుగా చేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య కావచ్చు.  మొదలు ముస్లిములను ఎగదోసి, ఇప్పుడు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలను రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా నువ్వు గద్దెనెక్కుతుండవచ్చు.

లెక్కల గారడీ ఎన్నికల్లో బొటాబొటి విజయం సాధిస్తుండొచ్చు, కానీ ప్రజల మనసుల్లో మాత్రం ఓడిపోయావు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరి హితం కోరవలసిన నువ్వు  “మనం”  –  ”వాళ్ళు” అనే తేడా తీసుకు వచ్చి మానసికంగా అప్పుడే వేరుపడిపోయావు!

అరుదైన హైదరాబాద్ చిత్రాలు (రెండో విడత)

అరుదైన హైదరాబాద్ చిత్రాలు మొదటి భాగం చూశారా?

అయితే ఇదిగో రెండో వాయిదా…

sec-bad-rly-stn

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

city-bus

అప్పటి ప్రభుత్వ రవాణా బస్సు

 

high-court

హై కోర్టు భవనం – ఎదురుగా ఉన్న మూసీ నదిలో బురద నీరు (మురికి నీరు కాదు) చూడండి

gandipet

గండిపేట చెరువు (ఉస్మాన్ సాగర్)

a-street

నగరంలో ఒక వీధి

fateh-maidan

ఫతేహ్ మైదాన్ (ఇప్పటి ఎల్.బి. స్టేడియం)లో సైనిక వందన స్వీకారం చేస్తున్న నిజాం నవాబు. దూరంగా ఇప్పటి అసెంబ్లీ భవనం కూడా కనపడుతుంది.  చిత్రంలో కనపడుతున్న కొండపైనే ఇప్పుడున్న బిర్లా మందిర్ కట్టింది!

*ఈ చిత్రాలన్నీ 1900-1948 మధ్య తీసినవి

గమనిక: అన్ని చిత్రాలూ టైం లైఫ్ (TIME- LIFE) సంస్థ వారి కాపీరైటు.

అరుదైన హైదరాబాద్ చిత్రాలు

గూగుల్ ఇటీవల టైం లైఫ్ (TIME-LIFE) సంస్థ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం లైఫ్ సంస్థ వద్ద ఉన్న చిత్రాలను గూగుల్ స్కాన్ చేసి అంతర్జాలంలో ఉంచుతుంది. అలా గూగుల్ వారు ఉంచిన చిత్రాలలోంచి పాత హైదరాబాద్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు లభ్యమవుతున్నాయి.

ఈ చిత్రాలు నిజాం కాలం నాటి హైదరాబాద్ ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ఇటీవల కొందరు తరచూ అంటున్నట్టు హైదరాబాద్ ను నిన్న మొన్న ఎవరో వచ్చి “అభివృద్ధి” చేయలేదని, అది స్వతంత్రం రాకపూర్వకమే ఒక ఆధునిక నగరమని ఈ చిత్రాలు మరోసారి నిరూపిస్తున్నాయి.

assembly-building

అసెంబ్లీ భవనం

nizamspalace1

రాత్రివేళ విద్యుద్దీపాల వెలుగులో నిజాం రాజప్రాసాదం

osmania_hospital1

ఉస్మానియా ఆసుపత్రి

british_residency

కోఠిలోని బ్రిటీష్ రెసిడెన్సి భవనం. ఇప్పుడు ఇందులో విమెన్స్ కాలేజీ ఉంది 

 

moazamjahimkt

మోజంజాహి మార్కెట్. (ఒక సారి ఆ వీధి దీపాలు చూడండి!)

 

secbad_rlystn

 నిర్మాణంలో ఉన్న నాంపల్లి రైల్వే స్టేషన్ 

state-central-library

అఫ్జల్ గంజ్ వద్ద ఉన్న స్టేట్ సెంట్రల్ లైబ్రరి భవనం

nizams-army

హైదరాబాద్ పురవీధుల గుండా నిజాం అశ్వికదళం కవాతు 

boys-playing-cricket

ఒక పబ్లిక్ స్కూళ్లో క్రికెట్ ఆడుతున్న పిల్లలు

village-mkt

హైదరాబాద్ సమీప గ్రామంలో ఒక వారాంతపు అంగడి

tractor-ploughing

ట్రాక్టర్ దున్నుతుంటే ఆసక్తిగా చూస్తున్న రైతులు

lady-soldiers

శిక్షణ పొందుతున్న మహిళా సైనికులు

nizam-time

నిజాం చిత్రంతో టైం పత్రిక ముఖచిత్ర కథనం (పన్నుల రూపేణా ప్రజల గోళ్లూడగొట్టి వసూలు చేసిన సొమ్ముతో నిజాం రాజు ఆనాడు ప్రపంచంలోనే ధనికుడైన వ్యక్తిగా పేరుగాంచాడు )

ఇంకొన్ని అరుదైన హైదరాబాద్ చిత్రాలు ఇక్కడ: http://hridayam.wordpress.com/2008/11/21/rare-hyderabad-photos-2/

గూగుల్ లైఫ్ వారి చిత్రాల భాండాగారంలోని చిత్రాలు చూడాలంటే ఇక్కడికి వెళ్లండి: http://images.google.com/hosted/life

గమనిక: అన్ని చిత్రాలూ టైం లైఫ్ (TIME- LIFE) సంస్థ వారి కాపీరైటు

తరువాతి కాగితం »


ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 39,242 సందర్శకులు