శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభోత్సవం భారతదేశ చరిత్రలో ఒక కీలక మలుపు అని కొన్ని పత్రికలు రాశాయి. అలా రాయడానికి వాటికి ఉన్న ప్రాతిపదిక వేరే కావొచ్చు కానీ నిజంగానే ఆ విమానాశ్రయం ప్రారంభోత్సవం దేశచరిత్రలో ఒక కీలక మలుపే. జాతి ప్రయోజనాలు ప్రైవేటు దొరల కాళ్లవద్ద మన పాలకులు ఎంత బాధ్యతారహితంగా తాకట్టు పెట్టారో నగ్నంగా ఆవిష్కృతమయిన సన్నివేశమది. ఈ దేశంలో జెండాలు మాత్రమే మారుతున్నాయని, అన్ని రాజకీయ పార్టీల ఎజెండాలు ప్రైవేటు, బహుళ జాతి సంస్థల పాదసేవకే అంకితమని సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రజలకు ప్రదర్శించిన మహా ఘట్టమది. గుక్కెడు మంచినీళ్ల దొరకక అల్లాడుతున్న పేద ప్రజలు కూడా “యూజర్ చార్జీలు” చెల్లించాలని, దేన్నైనా ఉచితంగా ఇస్తే విలువ తెలియదని గట్టున కూర్చుని నీతులు చెప్పే మధ్య, ఉన్నత తరగతుల వారి దిమ్మ తిరిగేలా “యూజర్ చార్జీల” రుచి చూపించిన రసవత్తర ఘట్టమది.
'భారతీయం' వర్గానికి భండారం
1991లో ఆర్ధిక సరళీకరణ జరిగిన కొత్తల్లో స్టాక్ మార్కెట్ మధ్య తరగతి ప్రజలకు ఒక చక్కటి మదుపు సాధనం. తదనంతర కాలంలో కొద్దిమంది బడా వ్యక్తులు, సంస్థల చేతిలో అది బందీ అయిపోయింది. అమెరికా లాంటి దేశాల్లో వడ్డీ రేట్లు పెద్దగా లేని కారణంగా అనేకమంది విదేశీయులు మన స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. ఈ మధ్య వ్యవహారం తారాస్థాయికి చేరింది. అమెరికన్ డాలర్ విలువ రోజు రోజుకీ పడిపోతుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) కోట్ల డాలర్లను మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడుతున్నారు. అయితే వాళ్లు చాలా సిస్టమాటిక్ గా చేస్తున్న ఒక మోసం వల్ల మన దేశపు సంపద మెల్లగా తీరాలు దాటుతోంది.
2007 సంవత్సరాన్ని విశ్లేషిస్తూ ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా ఇటీవలే పదవీ విరమణ చేసిన కె. రామచంద్ర మూర్తి గారు రాసిన ఈ చక్కని వ్యాసం నాకెంతో నచ్చింది. ఇది మీరూ తప్పక చదవాలి.
ఎంత దాచుకుందామని ప్రయత్నించిన మన నేతల అసలు నైజం బయటపడుతూనే ఉంటుంది. మొన్న ప్రణాళికా సంఘం మీటింగులో మన ప్రధాని అన్న ఈ మాటలు ఒక సారి చదవండి.
“ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీలు ఈ ఒక్క ఏడాదిలోనే భారీస్థాయిలో రూ.లక్ష కోట్లను దాటుతున్నాయి. దీనర్థం.. మనం కొత్త పాఠశాలలు పెట్టలేకపోవచ్చు. ఆసుపత్రులు కట్టలేం. విద్యార్థులకు ఉపకార వేతనాలివ్వలేం. వ్యవసాయ రంగంపై ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవచ్చు. మౌలిక వసతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉండొచ్చు. అందుచేత సబ్సిడీలను హేతుబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. “
- ప్రధాని మన్మోహన్సింగ్
నాకైతే పై లైన్లు చదివాక మన్మోహన్ సింగుని ఒకటే ప్రశ్న అడగాలనిపించింది
“కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మన్మోహన్?”
ప్రైవేటు కంపెనీలు పెట్టే అడ్డమైన గడ్డి తినమరిగి ఇటువంటి చెత్త వాగుడు వాగడం అలవాటైంది మన నేతలకు.
సబ్సిడీలు లక్ష కోట్లు దాటుతున్నాయని గుండెలు బాదుకుంటున్న మన్మోహన్ గారూ, మీకు ఈ కింది విషయాలు తెలియవా, లేక తెలిసీ దొంగనాటకాలు ఆడుతున్నారా?





ఇటీవలి వ్యాఖ్యలు