కలమూ కులమూ జులుమూ

మొన్న జరిగిన సంఘటనలో విషాదం ఏమిటంటే మంద కృష్ణ కోపం ఆంధ్ర జ్యోతి ఎండి రాధాకృష్ణ మీద అయితే దానికి బలి అయ్యింది మాత్రం కె.శ్రీనివాస్ కావటం. దళితుల పట్ల ఎంతో ప్రేమగా ఉండే ఆయనను ఈ కేసులో ఇరికించడం ద్వారా మంద కృష్ణ తన కంట్లో తానే పొడుచుకున్నట్టు అయ్యింది. మీడియాలో అగ్రవర్ణాల ఆధిపత్యం నిజమే అయినా అగ్ర వర్ణాల్లోనూ దళిత పక్షపాతులు ఉంటారనే చిన్న సత్యాన్ని మంద కృష్ణ వంటి వారు విస్మరించడమే బాధాకరం. ఇటువంటి సంఘటనలు మాదిగల వర్గీకరణ ఉద్యమానికి చేటు చేస్తాయే తప్ప ఇసుమంతైనా మేలు చేయవు. దళితుల ఆత్మగౌరవం కొరకు పోరాడే సందర్భాలు ఎన్నో ఉంటాయి కానీ ఇది అటువంటి సందర్బం కానే కాదు.

మంద కృష్ణ, ఆర్. కృష్ణయ్య  ప్రజల్లోంచి వచ్చిన నాయకులు. ఉద్యమాల ద్వారా పేరు, ప్రతిష్ట సంపాదించుకున్న వారు. ఆంధ్ర జ్యోతి రాసిన కధనం పై అభ్యంతరం ఉంటే దానిని శాంతియుతంగా ఖండించడానికి మంద కృష్ణకు,  ఆర్. కృష్ణయ్యకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. వాటన్నిటినీ వదిలి కలం పై జులుం చేయడం ద్వారా ఇన్నాళ్లూ ఎంతో కష్టపడి సంపాదించుకున్న మంచి పేరు మట్టిలో కలిసింది. తాము దళితులం కాబట్టి తమను ఎవరూ విమర్శించొద్దు అనడం నియంతృత్వం అవుతుంది. ఇటువంటి నియంతృత్వ పోకడలే చివరికి ఉద్యమాలను బలహీనపరుస్తాయి. కొన్నాళ్లు చంద్రబాబు నాయుడుకి, కొన్నాళ్లు వై ఎస్ రాజశేఖర రెడ్డికీ వంత పాడటం అలవాటు చేసుకున్న మంద కృష్ణ చివరికి తన వారి వద్దే విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉంది. ఏ ఆత్మగౌరవం కొరకైతే మంద కృష్ణ పోరాటం చేస్తున్నారో దానిని ఆయన ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టడమే బాధ కలిగించే విషయం.

బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇంత మొండిగా మీడియాతో తలపడ్డ రాజకీయ నాయకుడు (వైయెస్) మరొకరు లేరేమో.

ఇన్నాళ్లూ రామోజీ, రాధాకృష్ణల ఇతర వ్యాపారాలపై, అక్రమాలపై ప్రభుత్వం దాడులు చేస్తుంటే ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది. పత్రికాధిపతులు చట్టాలను నిస్సిగ్గుగా ఉల్లంఘించి పత్రికా స్వేచ్చ మాటున దాక్కోలేరు. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఇది నేరుగా పత్రికా స్వేచ్చపైనే దాడి. విధినిర్వహణలో ఉన్న ఒక దినపత్రిక ఎడిటర్ ను ఒక చిన్న కారణంపై అర్ధరాత్రి అరెస్టు చేయటం ఏ రకంగా చూసినా సమర్ధనీయం కాదు. 

వెయ్యిగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే చచ్చినట్టు రేపో ఎల్లుండో వైయెస్ గారికి కూడా ప్రజలు సరైన స్థానం చూపిస్తారు. అంత దాకా ఆయనగారి ఆగ్రహం నుండి తప్పించుకునేదెట్లా అనేదే ఇప్పుడు రాష్ట్ర మీడియా ముందు ఉన్న ప్రశ్న. పైకి ఎన్ని ముఖాలు చూపినా లోలోపల వైయెస్ లో ఓ రాక్షస ఫ్యాక్షనిస్టు దాగి ఉన్నాడని, తనని ఎదిరించిన వాడిని వేటాడే ఆటవిక లక్షణం ఇంకా ఆయనను వీడలేదని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

6 స్పందనలు నుండి “కలమూ కులమూ జులుమూ” కు


  1. 2 Ekanthapu Dileep 8:07 పూర్వాహ్నం వద్ద జూన్ 26, 2008

    Dileep gaaru,

    mee dhairyaanni abhinandistunnaanu. YSR abhimaanulu evarainaa mee meeda daaDi cheyyagalaru. jagratta.

    Dileep

  2. 3 కె.మహేష్ కుమార్ 8:44 పూర్వాహ్నం వద్ద జూన్ 26, 2008

    అధికారంలోకి వచ్చాక రాజశేఖర్ రెడ్డి వైఖరి ఒక నియంతను తలపిస్తోందనడం అతిశయోక్తి కాదు. మీ పరిశీలన చాలా సహేతుకం.

    ఇక మంద కృష్ణ మాదిగ ఉపయోగపడటం మొదలెట్టాక తన భుజాలపై తుపాకి పెట్టి పేల్చడానికి ప్రతి ఒక్కరూ తయారే. ఈ కుల నేతల్లొ కాస్త డబ్బూ,అధికారం వచ్చాక నిబద్దత లోపించిందని ఆ కులం వాళ్ళందరికీ తెలుసు. కానీ, మళ్ళీ హఠాత్తుగా కొత్త నేతలు కావాలంటే, అసలే అంతంతమాత్రంగా ఉన్న వీరి ఉనికికే ప్రమాదం గనక భరిస్తున్నారు. ఇలా ఎంతకాలం సాగుతుందో!

  3. 4 ప్రవీణ్ గార్లపాటి 5:28 అపరాహ్నం వద్ద జూన్ 26, 2008

    నిజమే… వైఎస్ కి మూడే రోజు తొందర్లోనే వస్తుంది.
    ఇంతగా దిగజారిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వీరేనేమో ???

  4. 5 chilamakuru vijayamohan 10:50 అపరాహ్నం వద్ద జూన్ 26, 2008

    తనను ఎదిరించిన వారినందరిని మందక్రిష్ణలాంటి వాళ్ళనడ్డంపెట్టుకొని అరెస్ట్ చేయించడంవల్ల వై.యస్స్.ప్రజల్లో క్రమంగా విశ్వాసం కోల్ఫోతున్నారు.ఆయన కక్షపోతుదనాన్నిఅర్థం చేసుకుంటున్నారు.

  5. 6 krishna rao jallipalli 5:21 అపరాహ్నం వద్ద జూన్ 27, 2008

    ఎవరిని పోషించి ఇందిరా గాంది బలి అయ్యింది??
    ఎవరిని పోషించి రాజీవ్ గాంధీ బలి అయ్యాడు??
    చూద్దాం… ఇప్పుడు ఎవరు బలి అవుతారో …


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 39,242 సందర్శకులు