మొదటి ఎస్సార్సీ విశాలాంధ్రనే ఏర్పాటు చెయ్యమమని సిఫార్స్ చేసిందని ఇటీవల విజయవాడలో స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఒక ప్రకటన చేశారు.
తెలంగాణ విషయంలో చాలా కాలంగా జరుగుతున్న అబద్దపు, అర్ధసత్యపు ప్రచారంలో ఇది ఒక తాజా అంకం మాత్రమే.
అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇంతకుముందులా మౌనంగా ఉండటానికి సిద్ధంగా లేరు.
లగడపాటి చేసిన వక్రీకరణకు వెంటనే సమాధానం రాద్దమనుకున్నాను కాని సరైన సాక్ష్యంతో రాస్తే బాగుంటుందని ఆగాను.
కొన్ని విషయాలు ఎంత తెలిసినవైనా వాటిని మరో సారి నెమరువేసుకునేటప్పుడు చాలా భావోద్వేగం కలుగుతుంది. మొదటి ఎస్సార్సీ నివేదిక చదువుతుంటే కూడా ఎన్నో భావాలు నన్ను కమ్మేశాయి. తెలంగాణకు జరిగిన వంచన, ద్రోహం, ఒక ప్రాంతంవారికి ఒనగూడిన ప్రయోజనాలు అన్నీ కళ్లకు కట్టినట్టయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే ఒక మోసపు పునాది పై జరిగిందని మొదటి ఎస్సార్సీ నివేదిక చదివితే ఇట్టే అర్ధం అవుతుంది
నిన్న ఆంధ్రజ్యోతిలో కట్టా శేఖర్ రెడ్డి గారు లగడపాటి వ్యాఖ్యలకు సమాధానం రాశారు.
కింద చూడండి…ఎలాంటి ఇంటర్ప్రెటేషన్లూ లేవు , అచ్చంగా మొదటి ఎస్సార్సీలోని పేజీలనే స్కాన్ చేసి పెట్టాను. చదవండి. తెలంగాణ ఒక ప్రాంత ప్రజల న్యాయమైన కోరిక అని, ఆ రాష్ట్రాన్ని సత్వరమే ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం నియమించిన ఒక అత్యున్నత స్థాయి సంస్థ 50 ఏళ్ల కిందటే తేల్చిచెప్పింది.
కమీషన్ తన 108వ పేజీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడుతూ ఇలా అన్నది
ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఉమ్మడి ఆకాంక్షలున్నాయి. అవి ఈ రెండు ప్రాంతాల ప్రజలను దగ్గరికి తీసుకు వస్తాయని ఆశించవచ్చు. అయితే ఒకవేళ అలాంటి వాతావరణం ఏర్పడక, తెలంగాణలో ప్రజాభిప్రాయం రెండు రాష్ట్రాల కలయికకు వ్యతిరేకంగానే వున్నట్టయితే తెలంగాణను ఎప్పటికి ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలి
అయినా ఇటువంటి కమీషన్ల రిపోర్టులను ఉటంకించేటప్పుడు తుది తీర్పులను చూడాలి కానీ అది పరిశీలించిన ఒక వాదనను పట్టుకుని అదే దాని సారమని అబద్దపు ప్రచారానికి పాల్పడితే ఎలా రాజగోపాల్?
మొదటీ ఎస్సార్సీ 257 పేజీ లో ఇచ్చిన రెకమండేషన్లు ఇవీ.
4. హైదరాబాద్: రాయ్ చూర్, గుల్బర్గా, మరఠ్వాడా జిల్లాలను ప్రస్తుత హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడదీయాలి. మిగతా రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా వ్యవహరిస్తూ అలాగే కొనసాగించాలి. దీనిలో తెలుగు మాట్లాడే జిల్లాలైన మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ (ఖమ్మం తో సహా), కరీం నగర్, అదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, మరియు మెదక్ తో పాటు బీదర్ జిల్లా, కృష్ణా జిల్లాలో (ఇప్పటి నల్గొండ జిల్లా) ఉన్న మునగాల ప్రాంతం ఇలా ఏర్పడ్డ హైదరాబాద్ రాష్ట్రం 1961 లో జరిగే సాధారణ ఎన్నికల తరువాత, హైదరాబాద్ శాసనసభలో మూడింట రెండొంతుల మెజారిటీ అమోదిస్తే ఆంధ్రతో కలవవచ్చుఎస్సార్సీ అన్ని రకాల వాదనలూ విన్నది. పాత హైదరాబాద్ రాష్ట్రాన్ని అలాగే కొనసాగించాలనీ, కొత్తగా తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలనీ, ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చెయ్యాలనీ ఇలా రకరకాల వాదనలని విని అన్నిటి పై వ్యాఖ్యానిస్తూ చివరికి ఇచ్చిన రెకమండేషన్లలో తెలంగాణా (హైదరాబాద్) ఏర్పాటు చెయ్యాలని విస్పష్టంగా ప్రకటించింది.
ఇప్పుడు లగడపాటి కేవలం విశాలాంధ్రకు మద్దతుగా ఎస్సార్సీ రాసిందని ఒక అబద్దపు ప్రచారానికి దిగుతున్నాడు.
ఈ పేజీలు చదివైనా కొంచెం నోరు మూసుకుంటావా లగడపాటీ?
SRC Page 105
SRC Page 106
SRC Page 107
SRC Page 108
SRC Page 109
Final Recommendations









That’s what I’m Talking about ! =D>
” Factual Reporting ”
…keep up the Good work Dileep.
Need of Indian People – Food and Shelter
Can be only and only achieved by Education, Jobs and good leaders.
Will Telangaana give
1. Give education, jobs and uplift the poor and needy?
or
2. Will it give CM ship and Ministries to another set of politicians (along with paisalu and business to their relatives and chamchaas).
Only time can tell. My vote is to 2 above.
అడిగిన వెంటనే ప్రత్యేక రాష్ట్రాలు ఇవ్వాలని దానిపై మరో మాటకి తావులేదనే ధోరణి అప్రజాస్వామికమే కాక ప్రమాదకరం కూడా. అలాంటి ధోరణి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనుగడకి ఏ విధంగానైతే హామీ ఇవ్వదో ఆ విధంగానే ప్రత్యేక తెలంగాణా మనుగడకి సైతం ఎలాంటి హామీ ఇవ్వదు. తొలి SRC సిఫార్సుల్ని ఆనాటి కేంద్రప్రభుత్వం పూర్తిగా ఆమోదించినా ఆమోదించకపోయినా మొత్తం మీద SRC అనే ఒక రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య బద్ధమైన వ్యవస్థ ద్వారానే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.కాబట్టి ప్రత్యేక తెలంగాణా కూడా అలాంటి అపాక్షికమైన ధర్మబద్ధమైన న్యాయసమ్మతమైన వ్యవస్థ ద్వారానే ఏర్పడితే బావుంటుంది. రెండో SRC (ఏర్పడితే దాని) నిర్ణయాలకి ఆంధ్రా తెలంగాణా రెండు ప్రాంతాలవారూ కట్టుబడి ఉండడానికి మానసికంగా సిద్ధపడాలి. ఒకసారి రెండో SRC ఏర్పడ్డాక దాని పనితీరులో జోక్యం కలిగించే విధంగా రాజకీయ ప్రకటనలు పరస్పర దూషణలు చెయ్యడం మానుకోవాలి.కమిషన్వారు తమ సిఫార్సుల్ని బయటపెట్టేదాకా వారికి మనం సహకరించాలి.వారు ఒక నిర్ణయానికి రావడానికి అయిదేళ్ళు పట్టొచ్చు.పదేళ్ళు కూడా పట్టొచ్చు.ఎంతకాలం పట్టినా మనం ఓర్పుతో ఎదురుచూడాలి. ఇది ఎదిగిన జాతుల లక్షణం.
తెలంగాణాని ఆంధ్రా ప్రాంతంతో కలపడానికి ఆనాడు కేంద్రప్రభుత్వానికి కనిపించిన కారణం ఉమ్మడి భాష అయితే ఈనాడు విడగొట్టడానికి సరైన సంతృప్తికరమైన కారణాలు కనిపించట్లేదు.
ప్రజాస్వామ్యం అన్నాక “కావాలి” అనే హక్కు ఒకరికి ఎంత ఉంటుందో “వద్దు” అనే హక్కు కూడా ఇతరులకి అంతే ఉంటుంది. అది విస్మరించి “వద్దు” అనేవారందరిమీదా విరుచుకుపడ్డం నిరంకుశత్వం.ప్రత్యేక తెలంగాణా అనేది కేవలం తెలంగాణాకి సంబంధించిన ప్రైవేట్ మేటర్ కాదు.అది 8 కోట్ల తెలుగుజాతికి సంబంధించిన విషయమని మరువరాదు. కాబట్టి దానిపై అభిప్రాయాలు చెప్పే హక్కు అందరికీ ఉంది. ఎవరినైనా నోరుమూసుకోమనడం సరైన మేనర్స్ కాదు.
మనది ఏపాటి ప్రజాస్వామ్యమో ‘ తెలంగాణ ప్రజల న్యాయమైన కోరిక ‘ అని ఎస్సార్సీ స్పష్టంగా రాసినా ఇవ్వని వాస్తవం చెబుతోందిప్పుడు.
రెండో ఎస్సార్సీ కోసం దశాబ్దం అయినా ఆగాలని సెలవిచ్చారు సంతోషం. మేమడిగేది ఒక్కటే. మొదటి ఎస్సార్సీనే అమలుచెయ్యలేదు ఇక దీనికి గ్యారెంటీ ఏమిటి?
అయినా బాల సుబ్రహ్మణ్యం గారూ! నేను నోరు మూసుకోమన్నది సదరు ఎంపీగారు అబద్దాలు చెప్పినందుకు. ఒట్టినే విశాలాంధ్ర కావాలనో, ఉండాలనో అంటే కాదు. దయచేసి నేను అన్న సందర్భాన్ని సరిగ్గా అర్ధం చేసుకోండి
అయినా సమస్యను ఎదుర్కొంటున్న ప్రజలను అడగాలి కాని అందర్నీ ఇన్వాల్వ్ చెయ్యాలనే వితండవాదం ఏమిటి? ఇక్కడి ప్రజలు తెలంగాణా కావాలంటున్నారా లేదా అనేదే ముఖ్యం. కోస్తాలోనో మరో చోటో ఉన్న వారు తెలంగాణా గురించి నిర్ణయించాలనడం ఏ విధమైన ప్రజాస్వామ్యం?
గురువుగారూ! మీరు మళ్ళీ వచ్చారా…? మీ వ్యాఖ్య లేదేంటబ్బా అని చూస్తున్నా…
తెలంగాణా అంటే చాలు,దాన్ని ఖండించడానికి ఖండాంతరాలు దాటైనా వచ్చేలా ఉన్నారే! చాలా రోజులుగా బ్లాగుల్లో మీ వ్యాఖ్యలు గమ్నిస్తున్నా!అది ఏ విషయమైనా సరే!అన్నీ ఏకపక్షమే.ఓ సరైన వివరణా ఉండదూ,కనీసం ఆలోచించవచ్చు అని కూడా అనిపించదు!
ఎవరైనా వ్యక్తిగత విమర్శ చేయవద్దు అని అంటే అనవచ్చు కాక కాని మీ దోరణిని అడ్డుకోవాల్సిందే!
అడిగిన వెంటనే యివ్వాలనే ధోరణి అప్రజాస్వామికం అంటున్నారు కదా…గురువు గారూ! తెలంగాణా అడుగుతున్నది నిన్నటి నుంచా మొన్నటి నుంచా? ఎన్నేళ్ళ చరిత్ర ఉంది తెలంగాణా ఉద్యమానికి?
ఎస్సార్సీ నివేదిక ఒకలాగా ఉంటే మరోలా వక్రీకరించి చెప్పటం భావప్రకటనా స్వేచ్చ! కుట్ర రాజకీయాలకు ఒళ్ళు మండి సాక్ష్యాలతొ సహా చూపించి కోపం కక్కేస్తే అది మేనర్స్ కాదు? ఆహా ఏం చెప్పారండీ!
కేవలం భాష ఒక్కటన్న పాపానికి తెలంగాణాను నిర్వీర్యం చేసిన కపట సమైక్యతా వాదానికి కారణాలు కనిపించట్లేదు విముక్తినివ్వటానికి.
కలకాలం కలిసుంటామని ప్రమాణం చేసుకుని ఒక్కటయ్యే ఆలుమగలయినా విడిపోవచ్చు.కాని పొత్తు కుదరనప్పుడు విడిపోవచ్చన్న నిబంధనతో కలుపుకున్న తెలంగాణా మాత్రం ప్రత్యేకం కాకూడదు.
ప్రత్యేక రాష్త్ర ఉద్యమం కొనసాగుతూ ఇన్నేళ్ళయినా, ఎందరో రాష్త్ర సాధనకు తమ ప్రాణాల్ని సైతం వీడినా పాపం ఐవి మీకు కనిపించవు.అవి సరైన కారణాలు కావు.
ఇంత జరిగిన తర్వాత ఎస్సార్సీ వేస్తామంటే ఎన్నేళ్ళయినా ఆగాలి.నోరు మూసుకుని కూర్చోవాలి.అంతటి ఓర్పు లేకుంటె వారిది ఎదిగిన జాతుల లక్షణం కాదు… మరి దోపిడీ జాతుల లక్షణమేమో…ఆరు నెల్లు సహవాసం చేస్తే….
మా సొంత బ్రతుకు మేం బ్రతుకుతాం అంటే వద్దనడానికి మీరెవరు? ప్రజాస్వామిక పద్దతిలొ ఏర్పడాలా? ప్రజాస్వామ్యబద్ధమైన ఆంధ్రప్రదేస్ ఏర్పాడ్డాక పెద్దమనుషుల నిబంధనలు తుంగలో తొక్కడం ఎంత ప్రజాస్వామికమో కదా మహాశయా!
ముల్కీ నిబంధనలు పాతర పెట్టిండ్రు. 610 జి.వో కు మోక్షం లేదు. మా ప్రాతం మేం ఏలుకుంట అని నెత్తీ నోరు బాదుకొని చెబుతున్నా వినరు.అర్రే ఎంత ప్రజాస్వామ్యమో!
అసలు ఒక విషయం చెప్పాలంటె ప్రత్యేక తెలంగాణా కావాలని అడిగేది ఓ ఫ్రొపెసర్ అయినా వాడు పిచ్చోడే! సమైక్యత అని ఖూనీ రాగాలు తీసిన వాడు పిచ్చోడే అయినా వాడు మేధావే!
నిజంగా ఎంత గొప్ప ఫార్ములా యిది…
యిలా కరడుగట్టిన తెలంగాణా వ్యతిరేకుల లాగానే పచ్చి తెలంగాణా వాదులు రావాలే! అప్పుడు గానీ తెలంగాణా రాదు.
జై తెలంగాణా! జై జై తెలంగాణా!!
నిజమేనండి కేసవాచారి గారు…మీకు ఈ ఆవేశం ఒక రాజకీయ అవకాశవాది మొదలు పెడితే గానీ రాలేదేంటబ్బా? ఈ లెక్కన తెలంగాణాలో ఉన్న ముస్లింల సంగతి ఏంటి? వారి మీద మీ కొబ్బరి కాయ కొట్టుడు ప్రారంభవోత్సవాలు, తెలంగాణాను ఎందుకు రుద్దుతారు. హైదరాబాదు వారిది కాదా? న్యాయంగా ఈ హైదరాబాదు మరి వారికి ప్రత్యేక రాష్టంగా ఇవాలి కదా? రంగారెడ్డి జిల్లాలో ఉన్న భాష అంతా ముస్లింల ఉర్దూ ప్రభావం ఉన్నదే కదా?
ఇంత కాలం కాశ్మీర్ లో భారత ప్రభుత్వం ఎందుకు మఠం వేసుక్కూర్చుంది? ఇక్కడి కంటే కరడు కట్టిన కాశ్మీరీ స్వాతంత్రవాదులు అక్కడ ఉన్న్నరు. మీదొక అన్యాయం, వారిది ఒక అన్యాయమా? మనకి కాశ్మీరు అనగానే మామ ఇచ్చిన కలర్ టీవి అన్నట్లు హక్కులు మాట్లాడతామే? ఎక్కడి లేని ఆవేశం వస్తుందే?
మీ బుర్రకి అర్ధం అయినా అవ్వకపోయినా “అడిగిన వెంటనే ప్రత్యేక రాష్ట్రాలు ఇవ్వాలని దానిపై మరో మాటకి తావులేదనే ధోరణి అప్రజాస్వామికమే కాక ప్రమాదకరం కూడా”
“అడిగిన వెంటనే ప్రత్యేక రాష్ట్రాలు ఇవ్వాలా !?!” అని అడుగుతున్న అందరు బ్రదర్స్ కి చిన్న ఇన్ఫో …
తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని గొంతెత్తి అడగడం మొదలు పెట్టింది 1952ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది 1956ల.(గుడ్డు, కోడి సంగతీ తెల్వది కని ఇవ్వయితె డేట్లు కూడ ఉన్నయి కదా?) జర ఇప్పట్నుంచి దయచేసి “అడిగిన వెంటనే ప్రత్యేక రాష్ట్రాలు ఇవ్వాలా !” అని ఇంకోసారీ అనే ముందు ఈ విషయం దృష్టిల పెట్టుకుంటె అందరం సంబరపడ్తం.
తెలుగు అన్నా! (నేను తెలుగు భాషను ఉద్దేశించడంలేదు. తెలుగు అనే పేరు పెట్టుకున్న మిత్రుడిని ఉద్దేశిస్తున్నాను)
ఏందన్నా ఇంత కన్ ఫ్యూజన్ గా రాసినావు. ఎక్కడ్నించి ఎక్కడికో పోయినవు?
ఇప్పుడు హిందూ, ముస్లిం గొడవెందుకొచ్చింది ఇందులోకి? హఠాత్తుగా ముస్లిం సోదరుల హక్కులు గుర్తుకురావడం, విభజించి పాలించమన్న ఆంగ్లేయుల సూత్రాన్ని గుర్తుకు తెస్తుందన్నా. ఇంకో విషయం, ఒక్క రంగారెడ్డి జిల్లానే కాదు, మొత్తం తెలంగాణ భాష అంతా ఉర్దూ ప్రభావం ఉన్నదే. దయచేసి తెలుసుకోగోర్తాను.
ఇక కాశ్మీర్లొ ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోందని తెగ ఆవేశపడ్డారు బానే ఉంది, ఇంతకూ ఇప్పుడెవరైనా అక్కడ జరుగుతున్నది కరెక్టే అని అన్నారా? లేదే, మరి ఎందుకన్నా అంతలా గొంతు చించుకుంటున్నారు?
కాశ్మీర్ భవిష్యత్తు గురించి మనం మాట్లాడినా, లేక తెలంగాణ భవిష్యత్తు గురించి ఇంకొకరు మాట్లాడినా అంత బాగుండదు.
ఇక మీరు మరో వాదన తేకముందే చెప్తున్నా. తెలంగాణ ఈ దేశం నుంచి వేర్పాటు కోరడంలేదు. ఉట్టినే వేర్పాటు వాదం, వేర్పాటువాదం అంటే సభ్యత అనిపించుకోదు.
KCR లాగే లగడపాటి కి కుడా వాడు ఏమి మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు
అన్నా అన్నా! నిజంగనే నా బుర్రకు అర్థం కాలేదే!
నువ్వేం జెప్పినవో ఏం మాట్లాడినవో నాకు అస్సలు సమజైతలేదు…
అవును అర్థం గాకుంట మాట్లాడినవ్ గాబట్టి ఖథర్నాక్ చెప్పినవ్ అనుకోవాల్నా ఏంది…సరేలే గట్నే గానీ!
మళ్ళొక్కసారి మా బుర్రలకు అర్థమయ్యేటట్టు జెప్పుతే మేం స్పందించనీకి బాగుంటది. జర దయుంచి ఏ విషయం మీద మాట్లాడుతానమో అదే మాట్లాడు…లేకుంటే దానికీ దీనికీ మధ్య ఉన్న లింక్ ఏందో జెప్పు! ఉంట మరి.
అన్నా! TELUGU అన్నా!! నిజంగనే నా బుర్రకు అర్థం కాలేదే!
నువ్వేం జెప్పినవో ఏం మాట్లాడినవో నాకు అస్సలు సమజైతలేదు…
అవును అర్థం గాకుంట మాట్లాడినవ్ గాబట్టి ఖథర్నాక్ చెప్పినవ్ అనుకోవాల్నా ఏంది…సరేలే గట్నే గానీ!
మళ్ళొక్కసారి మా బుర్రలకు అర్థమయ్యేటట్టు జెప్పుతే మేం స్పందించనీకి బాగుంటది. జర దయుంచి ఏ విషయం మీద మాట్లాడుతానమో అదే మాట్లాడు…లేకుంటే దానికీ దీనికీ మధ్య ఉన్న లింక్ ఏందో జెప్పు! ఉంట మరి.
ఆవేశంలో రాసినందువలన అర్ధం కాకుండా రాసినందుకు క్షమించాలి. నా ఉద్దేశం ఏమిటంటే తెలంగాణాకు మాత్రమే అన్యాయం జరుగుతున్నట్లు ప్రచారం జరగటం చాలా తప్పు. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం బంగారం చెప్పండి? ఎక్కడ ఆకలి చావులు లేవు చెప్పండి? ఇప్పటి వరకు చనిపోయిన 800+ (eenadu source) రైతులలో అన్ని ప్రాంతాల రైతులు ఉన్నారన్నా! అలాగే ఈ భూకబ్జాలు అన్ని ప్రాంతాలలోను జరుగు తున్నాయి. అవన్నీ ప్రస్తావించకుండా settlers అనే పదాలు వాడటం, దోపిడీదారులనటం ఎంతవరకు సబబు? ఈ లెక్కన హైదరాబాదులో తెలుగోల్లు settlers కాదా? NRIలు USAలో అమెరికన్ల కంటే ధనవంతులైపోయారే? వాళ్ళను దోపిడీదారులని అమెరికన్లంటే ఎలా ఉంటుంది?
KCR ఎక్కడ ఉన్న ఢిల్లీ ప్రభువులను కాకా పట్తటం తప్పు కాదు కానీ, తోటి రాష్ట్ర ప్రజలు మాత్రం దోపిడీ దారులు, కుట్రదారులు, Settlers. ఏమిటీ ఇది విచక్షనతో మాట్లాడున్న మాటలేనా? ఈ లెక్కన నా తెలెంగాణా ఆప్త, ప్రాణ మిత్రులు నన్ను settler గా చూడాలా? మీరలా చేస్తున్నట్లయితే మీకు నా జోహార్లు…మీరు కరడు కట్టిన తెలంగాణ వాదులయినట్ళే…మీకు మూడు వీరతాల్లు.
పెళ్ళాం తెలంగాణా, మొగుడు ఆంధ్ర అయితే ఏమి చెయ్యాలో కూడా కాస్త సెలవివ్వండి. తెలంగాణా సినిమాలు ఎలా ఉండాలో చెప్పండి? సినిమా మొత్తం తెలంగాణా యాస పెట్టుకుండామా? కరడుగా?
కేశవాచారి గారు, నేను మీ విషయం మీదే మాట్లాడా…అర్ధం కాకపోతే నేనేమి చెయ్యలేను. నోర్మూసుక్కోచవటం తప్ప
అన్నా
ఇప్పుడు మనం టాపిక్ మార్చకుండా మాట్లాడుకుందాం సరేనా. ఎందుకంటే తెలంగాణ అనేది చాలా పెద్ద టాపిక్. సెట్లర్స్ గురించి ఇంకో దగ్గర డీటైల్డ్ గా చర్చిద్దాం.
ఒక్క మాట మాత్రం చెప్పదల్చుకున్నా. కేసీయార్ చాలా సార్లు స్పష్టం చేశాడు కూడా.
పొట్టగొట్టిన వాళ్లతోనే పేచి, పొట్టకూటికి వచ్చిన వాళ్లతో కాదని.
నిన్న, ఇవ్వాళ, రేపు తెలంగాణ ప్రజలది అదే మాట, అదే బాట.
భిన్న మతాల, జాతుల, ప్రజల అరుదైన అందమైన మేళవింపు తెలంగాణ.
ఆహ్వానించి అన్నం (సారీ… గట్క) పెట్టడమేగాని పొమ్మనడం మా తెలంగాణా ప్రజల సంస్కృతి కాదు.
Endi telugannaa…cinema lo telangana bhasha pettukunte tappendi…telangana bhasha karadu gaa untundaa…ante andhra maandalaikam karadugaa undadaa…brain dobbindaa neeku….e mandalikam ayinaa evaridi vallaki sweet ga untundi….andariki premalu unnai
ఆంగ్లేయులు మనకి స్వాతంత్రం ప్రసాదించలేదు. మనం తీసుకోనూలేదు. అఖండ భారతీయ ప్రజ కడుపు మండినప్పుడు, కన్నెర్ర చేసినప్పుడు ఆంగ్లేయుల్ని తరిమి తరిమి కొట్టి మనం స్వాంతంత్ర్య సముపార్జించుకున్నాం, సంపాదించుకున్నాం. తెలంగాణా విషయం కూడా యింతకుమించి వేరైనదని నేననుకోను. తెలంగాణా అనేది ఒక ముఖ్యమంత్రో, ఒక క్యాబినెట్టో, మరో ప్రధానో ప్రసాదిస్తాడనుకోవడం పొరపాటే. ఎటూ, తెలంగాణా కోసం పోరాడే నాయకుల్లోని లోపాయికారీ తనం మనందరికీ తెలుస్తూనే వుంది. ఇంకా వాళ్ళని నమ్మి నష్ట పోకుండా తెలగాణా ప్రజ తనంతట తాను ఉద్యమిస్తే తప్ప ఈ వట్టొట్టి వాదనల వల్ల ప్రయోజనం వుండదని నేననుకుంటా. మూడున్నర కోట్లో, నాలుగు కోట్లో తెలంగాణా ప్రజ నిజంగా ఉద్యమిస్తే ప్రత్యేక తెలంగాణా క్షణంలో పని. ఏదైనా ప్రజల్లోంచి బలంగా రావాలనే నేనంటున్నది. నేను తెలంగాణా వాదినీ కాదు. సమైక్యవాదినీ కాదు. ప్రజలు కోరింది ఏదైనా తన వ్యక్తిగతానికి భిన్నంగా వున్నా వ్యక్తి ఆమోదించి తీరాలనే నేనంటాను.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించారు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు,చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా కమ్మ వాళ్ళను మేము నమ్మం,రాజధాని రాయలసీమలోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. నేటికీ మద్రాసు జనాభాలో 40% మంది తెలుగు వారున్నారు. “మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం” అన్నారు శ్రీరాములు. ఆయన ఆశయం నెరవేరలేదు.
lagadapati antha telengha dabbu dochu kunthu dailogs vyathirekangha matladuthunu telenga lo telenga ratstra droham telengana vidrohi telengana pourudu chance untha telenganakosam lagadapatini drohigha gurthinchala
అయ్యా ! Suresh Parapally గారూ!
తమకెందుకొచ్చిన కంఠశోష ? మీకేమో తెలుగులో రాయడం రాదు. ఇంగ్లీషులో తెలుగు రాసుకునే స్థితిలో ఉంటిరాయె. ఆ రాసినదాంట్లో కూడా శుద్ధంగా Telangana అని తిన్ననైన స్పెల్లింగు రాయడం చేతకాలేదు. మీరు కూడా తెలంగాణ గుఱించి మాట్లాడేవారే ! మా ఖర్మ !
ఒక లగడపాటిని అనడం దేనికి ? మేమందరమూ లగడపాటులమే !